హైవేపై డివైడర్ తొలగించి..

హైవేపై డివైడర్ తొలగించి..
  • ట్రాఫిక్ క్రమబద్ధీకరించిన పోలీసులు

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం మీదికొండ క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై భారీగా వర్షపు నీరు నిలిచి రాకపోకలు స్తంభించాయి. విషయం తెలిసిన స్థానిక పోలీసులు డివైడర్ తొలగించి హైవేపై రాకపోకలను క్రమబద్ధీకరించారు. వివరాల్లోకి వెళితే వరుస వర్షాలతో మండలంలోని రాఘవాపూర్ పెద్ద చెరువు, బాణాసి చెరువులు మతళ్లు పోయడంతో ఆ వర్షపు నీరంతా మీది కొండ క్రాస్ రోడ్ వద్ద జాతీయ రహదారిపై నిలిచింది. దీనితో రెండు మార్గాలలో రాకపోకలు స్తంభించాయి. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఎసిపి రఘు చందర్, సిఐ రాఘవేందర్, ఎస్సై నాగరాజు సిబ్బందితోపాటు స్థానికుల సహకారంతో జాతీయ రహదారిపై రెండు జెసిబిల ద్వారా డివైడర్ ను తొలగించగా చెరువును తలపించిన రోడ్డు రాకపోకలకు అణువుగా మార్చారు. దీంతో గంటల తరబడి నిలిచిన వాహనాలు గమ్యం వైపు పరుగులు పెట్టాయి.