రిటైర్డ్ "జవాన్"కు ఘన స్వాగతం

రిటైర్డ్ "జవాన్"కు ఘన స్వాగతం

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: 18 ఏళ్లపాటు ఆర్మీ జవాన్ గా దేశ సేవ  చేసి పదవీ విరమణతో ఇల్లు చేరిన రిటైర్డ్ జవాన్ ఏదునూరి సాంబరాజుకు స్వగ్రామంలో ఘన స్వాగతం పలికారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం చాగల్లు గ్రామానికి చెందిన ఎదునూరి సాంబరాజు 2006 నుండి 2023 వరుకు ఆర్మీ జవాన్ గా విధులు నిర్వహించాడు.

జమ్మూ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్ర లలో 18 సంవత్సరాల పాటు 'దేశ సేవ చేసి పదవీవిరమణ పొంది ఆదివారం స్వగ్రామం చాగల్లు కు వచ్చాడు. ఈ సందర్భంగా స్వాగత్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డప్పు చప్పులు, డీజే మోతలతో పువ్వుల దండలు వేసి ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పోగుల సారంగపాణి యూత్ అధ్యక్షులు కూన రాజు, కడియం యువసేన అధ్యక్షులు అన్నెపు కుమార్, స్వాగత్ యూత్ సభ్యులు. వార్డ్ సభ్యులు గ్రామ ప్రజలు పెద్ద తరలి వచ్చారు.