తెలివిగల్లా మోసగాడు పల్లా: డీసీసీ ప్రెసిడెంట్ కొమ్మూరి

తెలివిగల్లా మోసగాడు పల్లా: డీసీసీ ప్రెసిడెంట్ కొమ్మూరి

ముద్ర ప్రతినిధి, జనగామ : తెలివిగల్లా మోసగాడు పల్లా రాజేశ్వర్ రెడ్డి అని, ఈ ఎన్నికల్లో నైతిక విజయం నాదే అని కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అన్నారు. జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ తెలివి గల్లా మోసగాడు పల్లా అని, నీ బండారం బట్టబయలు చేస్తానని, నేను గెలిస్తే తపాస్ పల్లి రిజర్వాయర్ నుంచి నీళ్లు మళ్లించకపోవడం కుదరదు అని నన్ను ఓడించడానికి కేసీఆర్, హరీష్ రావు, అడ్డదారుల్లో  గెలి చిన ఈ గెలుపు గెలుపే కాదన్నారు.నైతిక విజయం నాదే అని అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకు వచ్చిన  రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్కకు అభినందనలు తెలిపారు. జనగామ నియోజకవర్గ ప్రజలకు, ఎల్లవేళలా   అందుబాటులో ఉంటూ అండ  ఉంటాను అని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చిందని ప్రజల అందరికి ప్రభుత్యం  నుంచి వచ్చే సంక్షేమ పథకాలను  దగ్గరుండి అందేలా  చూస్తాను అని తెలిపారు. కార్యక్రమంలో పిసిసి మెంబర్ చెంచరపు శ్రీనివాస్ రెడ్డి, పరమేశ్వర్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు బడికే ఇందిరా, జనగామ మండల అధ్యక్షులు చిర్ర సత్యనారాయణ రెడ్డి, సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి శ్రీనివాస్ రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నారాయణ రెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బనుక శివరాజ్ తదితరులు పాల్గొన్నారు.