కాంగ్రేస్ జెండా ఎగురుద్ది

కాంగ్రేస్ జెండా ఎగురుద్ది
  • యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

స్టేషన్ ఘన్‌పూర్, ముద్ర: వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి స్టేషన్ ఘన్‌పూర్ లో కాంగ్రేస్ పార్టీ జెండా ఎగురవేస్తామని యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కీసర దిలీప్ రెడ్డి అన్నారు. మంగళవారం ఇక్కడ ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దివంగత నేత వైఎస్సార్ అమలు చేసిన పథకాలు ఇప్పటికి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచాయన్నారు. సోమవారం పల్లగుట్టలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి చేసిన వాఖ్యలు కాంగ్రెస్ కి లీడర్ లేడని పార్టీ ఇచ్చిన గ్యారెంటీలను అమలపర్చదు అనడం సిగ్గుచేటని అన్నారు. కడియం శ్రీహరి రెండు సార్లు విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన డిగ్రీ కాలేజీ తీసుకురాలేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ మాట ఇస్తే దాని పైన కట్టుబడి ఉంటుందని అన్నారు. రాన్నున అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సింగపురం ఇందిరను భారీ మెజారిటీతో గెలిపించుకోనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో జెబిఎం జిల్లా అధ్యక్షులు ఎడ్ల భాస్కర్, నేతలు బసవగాని అనీల్, సింగ పురం వెంకటయ్య, చింత ఎల్లయ్య, ఐలపాక శ్రీనివాస్, మారపాక వసంత్, పృద్వీ జిల్లా తదితరులు పాల్గొన్నారు.