సాదాసీదాగా ‘ఎర్రబెల్లి’ నామినేషన్ – మొదటి సెట్ దాఖలు చేసిన మంత్రి దయాకర్రావు
పాలకుర్తి, ముద్ర : జనగామ జిల్లాలోని పాలకుర్తి అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సోమవారం సాదాసీదాగా నామినేషన్ వేశారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి రోహిత్ సింగ్కు తన మొదటి నామినేషన్ సెట్ను అందజేశారు. అంతకుముందు శ్రీసోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నామినేషన్ పత్రాలతో ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు తీగల దయాకర్ గౌడ్, మాజీ జీసీసీ చైర్మెన్ గాంధీ, కృష్ణ కిషోర్రెడ్డి, ఐలయ్య ఉన్నారు. కాగా, ఈనెల 10న కార్యకర్తల సమక్షంలో పెద్ద ఎత్తున తరలి వెళ్లిన మంత్రి మరోసారి నామినేషన్ వేస్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.