కాంగ్రెసోళ్లను నిలదీయండి .. టిఆర్ఎస్ అభ్యర్థి కడియం

కాంగ్రెసోళ్లను నిలదీయండి .. టిఆర్ఎస్ అభ్యర్థి కడియం

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: ఐదు రాష్ట్రాల్లో అమలు చేయని పథకాలపై కాంగ్రెసోళ్లను నిలదీయండని టిఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్, చత్తీస్గడ్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో అమలు చేయని పథకాలు హలో ఎలా అమలు చేస్తారని ఓట్లు  అడిగేందుకు వచ్చిన కాంగ్రెస్ నాయకులను నిలదీయండి అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చే 24 గంటల కరెంటు కావాలా కాంగ్రెస్ పార్టీ ఇస్తామన్న మూడు గంటల కరెంటు కావాలా రైతులు ఆలోచించాలన్నారు.

అమలుకు స్వాధ్యం కానీ హామీలతో రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ మోసం చేసేందుకు ప్రయత్నిస్తుందన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసే అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికి తలమానికం అన్నారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రాష్ట్రాన్ని కంటికి రెప్పలా కాపాడే సీఎం కేసీఆర్ ను మరో మారు ముఖ్యమంత్రి చేయాలని ఆయన పిలుపు ఇచ్చారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాకు సాగునీటి, తాగునీటి సమస్యను పరిష్కరించే లింగంపల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని ఆ ప్రాంత ప్రజల విజ్ఞప్తి మేరకు రద్దు చేసినట్లు తెలిపారు. అనంతరం శివుని పెళ్లిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేద్దామని మీ సహకారం తో మరోసారి ఆశీర్వదించాలన్నారు. ఈ కార్యక్రమంలో బెల్దే వెంకన్న, మామిడాల లింగారెడ్డి, గన్ను నరసింహులు, అక్కనపల్లి బాలరాజు, రాపూర్ మధుసూదన్ రెడ్డి, బెల్లం వెంకటస్వామి, బుర్ల లత శంకర్, తోట సత్యం, బూర్ల రాజు, బుర్ల శీను, గుర్రం శీను గుర్రం పాతి కుమార్ ఆరెళ్ళ అశోక్ పాల్గొన్నారు.