పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: ఏసిపి రఘు చందర్

పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: ఏసిపి రఘు చందర్

ముద్ర, జఫర్‌గడ్ : సమాజంలో శాంతి స్థాపన కోసం, అసాంఘిక శక్తులతో జరిపిన పోరులో అసువులు బాసిన పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని వర్ధన్నపేట ఏసీపీ రఘు చందర్ పేర్కొన్నారు. పోలీస్ అమరవీరుల సస్మరణ వారోత్సవాలను పురస్కరించుకొని ఆదివారం వర్ధన్నపేట డివిజన్ ఆధ్వర్యంలో ఏబిఎస్ ఫంక్షన్ హాల్ వర్ధన్నపేటలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఏసిపి రఘు చందర్ అతిధులుగా హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏసీపీ రఘు చందర్ మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల స్ఫూర్తితో శాంతి భద్రతల పరిరక్షణ కోసం ముందుకు సాగుతామని, అమరుల త్యాగాలు స్మరించుకోవలసిన బాధ్యత అందరిపై ఉందని ఆయన తెలిపారు. పోలీస్ అమరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా జనగామ జిల్లా జఫర్గడ్ పోలీసులు, యువత రక్తదానం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, జఫర్గడ్ ఎస్సై మహేందర్, పోలీస్ సిబ్బంది, యువకులు పాల్గొన్నారు