కాంగ్రెస్ లో పలువురి చేరిక

కాంగ్రెస్ లో పలువురి చేరిక

ముద్ర ప్రతినిధి, జనగామ: కాంగ్రెస్ యువ నాయకుడు కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్, బీజేపీకి చెందిన నాయకులు కాంగ్రెస్ లో చేరారు. ఆదివారం జనగామ పట్టణ వివర్స్ కాలనీ లక్ష్మీ నరసింహ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 11వ వార్డు బీజేపీ కౌన్సిలర్ కాంటెస్ట్ అభ్యర్థి వెంకటేష్ తో పాటు 100 మంది కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వారికి ప్రశాంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

కార్యక్రమంలో జనగామ జిల్లా కాంగ్రెస్ నాయకులు జిల్లెల్ల సిద్దారెడ్డి, శ్రీరాం శ్రీనివాస్, బొంతపల్లి నాగరాజు, జనగామ నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ పిట్టల సతీష్, కొడెం శ్రీనివాస్, బిర్రు సత్యనారాయణ, ఎనగందుల వెంకటేష్, వేమళ్ళ అభిలాష్ రెడ్డి, రచ్చ సత్యనారాయణ, కాముని సమ్మయ్య, గందమల్ల కమలాకర్, రచ్చ శ్రీనివాస్, నాల్యపల్లి శ్రీనివాస్,  తదితరులు పాల్గొన్నారు.