కస్టమర్లకు నాణ్యమైన ఫుడ్‌ అందించాలి

కస్టమర్లకు నాణ్యమైన ఫుడ్‌ అందించాలి

* ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
ముద్ర ప్రతినిధి, జనగామ: హోటల్‌కు వచ్చే కస్టమర్లకు నాణ్యమైన ఫుడ్‌ అందించాలని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిగిరిరెడ్డి సూచించారు. పట్టణంలోని సూర్యాపేట రోడ్డులో ఏర్పాటు చేసిన ‘ఆరంజ్‌ బకెట్‌’ బిర్యాని సెంటర్‌‌ను శుక్రవారం ఎమ్మెల్యే రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌‌పర్సన్‌ జమున లింగయ్య, కౌన్సిలర్లు వాంకుడోతు అనిత, కర్రె శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు హాటల్‌ యజమాని సి.హెచ్‌ ఉపేందర్‌, ఉమారాణి‌ దంపతులు నిర్వహించిన పూజా కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డి ఇతర నాయకులు పాల్గొన్నారు.