ఆ ఇద్దరూ.. పిచ్చికుక్కల్లా మొరుగుతున్నరు: మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌ రావు

ఆ ఇద్దరూ.. పిచ్చికుక్కల్లా మొరుగుతున్నరు: మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌ రావు

ముద్ర ప్రతినిధి, జనగామ: రాష్ట్ర అభివృద్ధి చూసి ఓర్వలేక బీజేపీ నేత బండి సంజయ్‌, కాంగ్రెస్‌ లీడర్‌‌ రేవంత్‌రెడ్డి తమ సీఎం కేసీఆర్, కేటీఆర్‌‌లపై పిచ్చి కుక్కల్లాగా మొరుగుతున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌రావు మండిపడ్డారు. ఆ బ్రోకర్ గాళ్ల మాటలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం నేలపోగులలో అంతర్గత సీసీ రోడ్లకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా రూ.23.44 లక్షలతో చేపట్టిన ఆధునీకరణ, మౌలిక వసతులు, పెయింటింగ్స్, గ్రంథాలు వంటి అనేక సదుపాయాలకు మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేలపోగుల ఈ గ్రామంపై తనకు ప్రత్యేక ప్రేమ ఉందని, తన శిష్యులు, తన దగ్గర పని చేసే వాళ్లు ఈ గ్రామస్తులే అని చెప్పారు.

అందుకే గ్రామానికి అడుగగానే నిధులు ఇచ్చానని, అవసరాన్ని బట్టి మరిన్ని నిధులు ఇస్తానని హామీ ఇచ్చారు. అలాగే నేలపోగుల స్కూల్ కి నిధులు ఖర్చు పెడుతున్న కేసరి లక్ష్మీనారాయణ, వారి కుటుంబాన్ని ఈ సందర్భంగా మంత్రి అభినందించారు.  తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇద్దరే ఇద్దరు సీఎంలు నచ్చారని, అందులో ఒకరు ఎన్టీఆర్‌‌,  ఇంకొకరు కేసీఆర్‌‌ అని చెప్పుకొచ్చారు. కేసీఆర్‌‌ గొప్ప మనసు ఉన్న మహారాజు అని కొనియాడారు. ఆయన వల్ల రాష్ట్రం మొత్తం బాగుపడుతుందన్నారు. కార్యక్రమంలో స్టేషన్ ఘన్‌ పూర్‌‌ ఎమ్మెల్యే డాక్టర్‌‌ తాటికొండ రాజయ్య, కలెక్టర్ సి.హెచ్ శివలింగయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.