ఈవీఎంలపై అవగాహన ఉండాలి

ఈవీఎంలపై అవగాహన ఉండాలి

ముద్ర ప్రతినిధి, జనగామ : ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లపై (ఈవీఎం) అందరికీ అవగాహన ఉండాలని జనగామ కలెక్టర్ శివలింగయ్య అన్నారు. శుక్రవారం జనగామ పట్టణంలోని రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈవీఎం అవగాహన, ప్రదర్శన కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఈవీఎంల పనితీరు గురించి తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఓటు హక్కు వినియోగం, పారదర్శకతపై ఈ కేంద్రం ద్వారా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఆయన వెంట ఆర్డిఓ మురళీకృష్ణ, తహసీల్దార్ రవీందర్, డీఏవో ఆండాళ్, తదితరులు ఉన్నారు.