ఆరు గ్యారంటీలతో అధికారం ఖాయం

ఆరు గ్యారంటీలతో అధికారం ఖాయం

స్టేషన్ ఘన్ పూర్, ముద్ర: కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి రావడం ఖాయమని జనగామ జిల్లా యువజన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కోరుకొప్పుల మధు దీమ వ్యక్తం చేశారు. మంగళవారం ఇక్కడ మాట్లాడుతూ సోనియా గాంధీ ప్రకటించిన రూ. 500 లకు గ్యాస్ సిలిండర్, రైతులకు సాయం, కౌలు రైతులకు భరోసా, గృహలక్ష్మి, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, నెలకు ఆర్థిక సహాయం వంటి హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తప్పకుండా అమలు చేస్తుందని చెప్పారు.రాష్ట్ర ప్రభుత్వం వైఫైల్యాలను ప్రతి గడపకు తీసుకెళ్లి ప్రజలు చైతన్య పరిచి కాంగ్రెస్ గెలుపుకు ప్రతీ కార్యకర్త నాయకులు కృషి చేయాలి అన్నారు.