శివునిపల్లిలో వ్యక్తి హత్య

శివునిపల్లిలో వ్యక్తి హత్య

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం శివుని పల్లి గ్రామానికి చెందిన తీగల కరుణాకర్(32) అనే వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం... తీగల కరుణాకర్ అనే వ్యక్తిని శుక్రవారం రాత్రి గ్రామ శివారులోని మామిడి తోటలో పథకం ప్రకారం హత్య చేసి నమిలిగొండ పెద్ద చెరువులో మృతదేహాన్ని వేసినట్లు తెలిపారు. మృతుడి భార్య తీగల కవిత కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదే గ్రామానికి చెందిన చిక్కుడు నాగరాజు అతని భార్య చిక్కుడు మమతలపై అనుమానం ఉన్నట్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు స్టేషన్ ఘన్పూర్ ఏసిపి ఎస్.శ్రీనివాస్ తెలిపారు.