ముకుందాపురం ముద్దుబిడ్డ కు మదర్ తెరిసా పురస్కారం
![ముకుందాపురం ముద్దుబిడ్డ కు మదర్ తెరిసా పురస్కారం](https://mudranews.in/uploads/images/2023/08/image_750x_64eecccbb5b21.jpg)
- నింగి నేల మేము సైతం అంటూ విస్తరించిన సామాజిక సేవా కార్యక్రమాలు
- ఆర్తులను అన్నార్తులను ఆదుకుంటూ ఆపదలో నేనున్నానంటూ ముందుకు సాగిన ఎల్ సి గోపయ్య
- కరోనా కష్టకాలంలో టిఫిన్లు భోజనాలు ఇంటిసరుకులు అందించిన చేతికి ఎముక లేని దాత గోపి
- అంధులకు వృద్ధులకు వికలాంగులకు ఆరోగ్య శిబిరాల నిర్వహణ
- ముకుందాపురం వాసికి రాష్ట్ర రాజధాని లో ఘన సన్మానం
- మదర్ తెరిసా అవార్డు పురస్కారం సత్కారం బహుమతి ప్రధానం
- గోపయ్య సేవలను కొనియాడిన వ్యక్తులు గోపయ్య... నీ సేవలు చాలా గొప్ప వయ్యా
ముద్ర నేరేడుచర్ల: మదర్ థెరిసా సేవలు అనిర్వచనీయంసేవకు ప్రతి రూపం మదర్ థెరిసా అని, ఆమె సేవలు అమోఘం అని తెలంగాణ శాసన మండలి డిప్యూటీ స్పీకర్ బండ ప్రకాష్ ముదిరాజ్, MLC బొగ్గరపు దయానంద్ గుప్త అన్నారు. మదర్ థెరిసా జయంతి ముగింపు కార్యక్రమం లో భాగంగా తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో వివిధ రంగాలలో సేవా కార్యక్రమాలు చేస్తున్న వారికి మెమంటో, బహుమతి ప్రధానం చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన వారు మదర్ థెరిసా అబాగ్యులకు చేసిన సేవలను కొనియాడారు. నింగి నేల మేము సైతం ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న నేరేడుచర్ల మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన పౌండర్, ప్రెసిడెంట్ Er LC GOPAIAH కు అవార్డు ప్రధానం చేసారు. ఈ సందర్బంగా Er. LC GOPAIAH ను శానస మండలి డిప్యుటీ స్పీకర్ మరియు MLC ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమం లో తెలంగాణ హైకోర్టు రిటైర్డ్ జడ్జి చంద్ర కుమార్, సిటిజన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ Dr. రాజ్ నారాయణ ముదిరాజ్, కో ఆర్డినేటర్ శివకుమార్, మరియు ఉదయ్, అనిల్, రాజు తదితరులు పాల్గొన్నారు.