కేటీఆర్ జన్మదిన వేడుకలు రైతు కూలీల మధ్య...

కేటీఆర్ జన్మదిన వేడుకలు రైతు కూలీల మధ్య...

ఎవరెన్ని కుట్రలు చేసినా కోదాడ లో జెండా ఎగురువేసేది మేమే

ముద్ర ప్రతినిధి , కోదాడ: ఎవరెన్ని కుట్రలు చేసినా కోదాడ నియోజకవర్గంలో ఎగిరేది తమ జెండా నేనని , తెలంగాణ రాష్ట్రంలో రైతులకు , రైతు కూలీలకు అనేక సంక్షేమ పథకాలని అమలుచేసి రైతుకూలీ పక్షపాతి గా కేసీఆర్ ప్రభుత్వం నిలిచిందని బిఆర్ఎస్ కోదాడ నియోజకవర్గ మాజీ ఇంచార్జ్ కన్మంత రెడ్డి శశిధర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఎర్నేని వెంకటరత్నం బాబులు అన్నారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను స్థానిక బస్టాండ్ సెంటర్ కూలి అడ్డాలో రైతులు , వ్యవసాయ కూలీలతో కలిసి ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి మిఠాయి లు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో దేశంలోనే మొట్టమొదటిసారిగా 24 గంటలు ఉచిత విద్యుత్తు రైతులకు అందించిన ఘనత , కూలీల సంక్షేమానికి అనేక పథకాలని అమలు చేసిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమేనని రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలను ప్రజలకు అందించేది కూడా బిఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు .

ఈ కార్యక్రమంలో రైతులు రైతుకూలీలతో పాటు చిలుకూరు జడ్పిటిసి బొలిశెట్టి శిరీష నాగేంద్రబాబు, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యులు రాయపూడి వెంకటనారాయణ, మున్సిపల్ కౌన్సిలర్లు గుండపనేని పద్మనాగేశ్వరరావు, పెండెం వెంకటేశ్వర్లు, తిపిరిశెట్టి సుశీల రాజు, టిఆర్ఎస్ నాయకులు రామినేని సత్యనారాయణ, శశిధర్ రెడ్డి యువసేన నాయకులు దున్న ప్రవీణ్, సుధాకర్ రాము తదితరులు పాల్గొన్నారు