భూ తగాదాలలో ఘర్షణ

భూ తగాదాలలో ఘర్షణ
  • వ్యక్తిపై గొడ్డలితో దాడి తీవ్రంగా గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలింపు

తుంగతుర్తి ముద్ర:-మండల పరిధిలోని బండ రామారం గ్రామంలో భూ తగాదాల విషయంలో వ్యక్తిపై ముగ్గురు కలిసి దాడి చేసిన సంఘటన ఆదివారం జరిగింది  సంబంధించి బాధితునీ  బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.  బండ రామారం గ్రామానికి చెందిన ఉప్పుల ఎల్లయ్య అనే వ్యక్తిపై అదే గ్రామానికి చెందిన కొల్లూరు సోమ నరసయ్య, లింగయ్య ,రాజు కలిసి  తలపై బలంగా గొడ్డలితో దాడి చేసినట్లు కుటుంబసభ్యులు పేర్కొన్నారు. రక్తస్రావం జరగడంతో తుంగతుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. జరిగిన సంఘటనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు, కుటుంబ సభ్యులు తెలిపారు.