కనువిందు చేస్తున్న జలపాతం..

కనువిందు చేస్తున్న జలపాతం..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి:జయశంకర్ భూపాలపల్లి చిట్యాల మండలంలోని నవాబుపేట శివారు శాంతినగర్ సమీపంలో గల దుంకుడు జలపాతం కనువిందు చేస్తుంది. శాంతినగర్ శివారులోని వెలిశాల గుట్టల నడుమ నుంచి వస్తున్న జలాలు చూపరులను కట్టి పడేస్తున్నవి. పచ్చని అడవి మధ్య గుట్టలపై నుంచి జాలువారుతూ బండరాళ్ల మధ్య నుండి జలాలు దూకుతున్నవి.

చిట్యాల మండల కేంద్రానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న జలపాతం పాదచారులను, వాహనదారులను ఆకట్టుకునేలా జలకలను సంతరించుకుంటున్నది. టేకుమట్ల, చిట్యాల మండల కేంద్రాల మధ్యలో ఇటీవలె నూతనంగా వెలుగులోకి వచ్చిన ఊ జలపాతాన్ని చూసేందుకు పర్యాటకులు ఆసక్తి కనబరుస్తుండడం విశేషం.