పిడుగుపాటుతో  ఒకరి  మృతి

పిడుగుపాటుతో  ఒకరి  మృతి

కాటారం, ముద్ర: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం దామరకుంట గ్రామానికి చెందిన గూడూరి రాజేశ్వరరావు (46)అనే వ్యక్తి మంగళవారం పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... రాజేశ్వరరావు వ్యవసాయ కూలిగా,కౌలు రైతుగా జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం వరి పొలంలో కలుపు తీస్తుండగా పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు.స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.దీంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని చూడగా రాజేశ్వరరావు అప్పటికే మృతిచెందాడు.స్థానికుల సహాయంతో మృత దేహాన్ని ఇంటికి తరలించారు.  మృతునికి భార్య కుమార్తె,కుమారుడు ఉన్నారు.