గోమాతకు వినతిపత్రం - పంచాయతీ కార్మికుల వినూత్న నిరసన

గోమాతకు వినతిపత్రం - పంచాయతీ కార్మికుల వినూత్న నిరసన

ముద్ర న్యూస్, కాటారం:జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో పంచాయతీ కార్మికులు రోజుకో విధంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు.తమ డిమాండ్ల సాధన కోసం చేస్తున్న నిరవధిక సమ్మె 15వ రోజు గోమాతకు వినతిపత్రం అందించి నిరసన వ్యక్తం చేశారు. గ్రామపంచాయతీలలో పారిశుద్ధ్య పనులు నిలిచిపోయి పదిహేను రోజులు గడిచిన ప్రభుత్వం మొద్దు నటిస్తోందని దీనికి నిరసనగా గోమాతకు వింత పత్రం అందించి నిరసన వ్యక్తం చేసినట్లు జిల్లా జేఏసీ ప్రధాన కార్యదర్శి చిట్యాల శశి కుమార్ జిల్లా ముఖ్య నాయకులు మెండ మల్లేష్,దోమల శ్రీనివాస్,ఇనుగాల కొండయ్య, మండల అధ్యక్షుడు పప్పుల లక్ష్మీనారాయణ వివరించారు. ఈ కార్యక్రమంలో మండల కోశాధికారి ఆత్మకూరి రవి, మండల ప్రధాన కార్యదర్శి బుర్రకుంట రవి,పంచాయతి కార్మికులు రాజేశ్వరి,అర్జున్, బుచ్చయ్య, రాజయ్య, గౌరమ్మ తదితరులు సిబ్బంది పాల్గొన్నారు.