అప్పుల బాధతో యువకుడు ఆత్మహత్య

అప్పుల బాధతో యువకుడు ఆత్మహత్య

చిట్యాల ముద్ర న్యూస్: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండలం జడలపేట గ్రామంలో అప్పుల బాధతో యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే జడల పేట గ్రామంలోని తణుకు వికాస్ (35) వృత్తిరీత్యా కిరాణా షాపు, బెల్ట్ షాపు, గ్రామంలో వ్యాపారం చేసేవాడు. షాపు కోసం అప్పుచేసి చేసిన అప్పును తీర్చడం కోసం అధిక వడ్డీ ఐదు నుండి పది రూపాయల వడ్డీకి అప్పు తెచ్చి ఒకరి వద్ద నుండి ఒకరికి అప్పు కడుతూ ఉండేవాడు.

దీనితో అధిక వడ్డీలతో 20 లక్షల వరకు అప్పు పెరగడంతో అప్పుడు ఎలా తీర్చాలో మదనపడి తీవ్ర మనోవేదనకు గురై శుక్రవారం ఉదయం తెల్లవారుజామున ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య, కూతురు, కుమారుడు, ఉన్నారు. అతని మృతితో పిల్లలు భార్య కుటుంబీకులు గ్రామస్తులు కన్నీరు మున్నేరు విలపించారు.