ఇంటింటికి బిజెపి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కాసం

ఇంటింటికి బిజెపి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కాసం

 రాజాపేట జూన్ 22 (ముద్ర న్యూస్) రాజాపేట మండలంలో ఇంటింటికి బిజెపి కార్యక్రమాన్ని గురువారం మండల కేంద్రంలో ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోడీ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరవేయడంలో భాగంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీకారం చుట్టారు .కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు తో పాటు రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించడం జరిగిందని ఆయన అన్నారు. రైతుల రుణమాఫీ గత ఎన్నికల్లో గంధ మల్ల ప్రభాస్ పల్లి నీరును ఆలేరు ప్రాంతానికి అందిస్తామని చెప్పి మరలా రైతన్న మోసం చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి ప్రాజెక్టుల పేరుతోనే ప్రజలు మోసం చేస్తుంది. గంధ మల్ల చిరు నీరు అందించి ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు.

అంతేకాకుండా నిరుద్యోగ భృతి డబుల్ బెడ్ రూములు మరిచి గృహలక్ష్మి పేరుతోనే మళ్లీ ప్రజలు మోసం చేయడాన కుట్ర చేస్తుంది గత 8 సంవత్సరాల నుండి బీసీలను చిన్నచూపు చూసి బీసీ కార్పొరేషన్ కింద ఏ ఒక్కరికి రుణాలు అందించకుండా ఇప్పుడు కొత్తగా బీసీ లకు లక్ష రూపాయలు రుణాలు ఇస్తామని చెప్పడం బీసీలను మోసం చేయడమే నిజంగా బీసీలకు రుణాలు ఇవ్వాలనుకుంటే అప్లై చేసిన ప్రతి ఒక్కరికి రుణం ఇవ్వాలని గడువు తొలగించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు అశోక్ గౌడ్ స్థానిక ఎంపీటీసీ దాచేపల్లి రాజు మండల పార్టీ అధ్యక్షులు కాయితి బాల్రెడ్డి కానుగంటి శ్రీనివాస్ రెడ్డి బింగు శ్రీనివాస్ రాజాపేట శక్తి కేంద్రం ఇంచార్చనపల్లి లక్ష్మణ్ మండలప్రధాన కార్యదర్శి గవ్వల సిద్దేశ్వర సాధన పైన శంకర్ శ్రీశైలం శేఖర్ రెడ్డి సిద్ధులు శ్రీను నాయక్ గణేష్ నాయక్ శ్రీహరి శ్రీశైలం జట్ట సిద్దులు సంతోష్ తదితరులు పాల్గొన్నారు.