నవరాత్రి ఉత్సవాలకు అనుమతి తప్పనిసరి

నవరాత్రి ఉత్సవాలకు అనుమతి తప్పనిసరి
  • మొగుళ్ళపల్లి ఎస్ఐ జాఢీ శ్రీధర్

మొగుళ్లపల్లి, ముద్ర: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిర్వహించే వారు అనుమతులు తీసుకొని పోలీసులకు సహకరించాలని మొగుళ్ళపల్లి ఎస్ఐ జాఢీ శ్రీధర్ నిర్వాహకులను కోరారు. గురువారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేసే నిర్వాహకులు ఆర్గనైజర్ పేరుతో పాటు, ఫోన్ నెంబర్, గణేష్ విగ్రహాల ఎత్తు, నిమజ్జనం చేసే తేదీ మరియు స్థలంను ఆన్ లైన్ లో  దరఖాస్తు చేసుకొని పోలీసులకు తెలియజేయాలని ఆయన సూచించారు.