కనులపండువలా కొనసాగుతున్న కోటంచ శ్రీ లక్ష్మీ నరసింహా స్వామి వారి బ్రహ్మోత్సవాలు..

కనులపండువలా కొనసాగుతున్న కోటంచ శ్రీ లక్ష్మీ నరసింహా స్వామి వారి బ్రహ్మోత్సవాలు..
  • స్వామి వారి పల్లకి సేవలో గండ్ర సత్యనారాయణ రావు..
  • దమ్మన్నపేట గ్రామంలో సిద్ధ కరుణాకర్ కి చెందిన ఏనుగు రథాన్ని టెంకాయ కొట్టి ప్రారంభించిన గండ్ర సత్యనారాయణ రావు.

 ముద్ర న్యూస్ రేగొండ: మండలంలోని కోటంచ గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా కొనసాగుతున్నాయి. (బుధవారం) ఉదయం కోటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని టీపీసీసీ సభ్యులు, భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి గండ్ర సత్యనారాయణ రావు దర్శించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.  మండలం లోని దమ్మన్నపేట గ్రామంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సిద్ధ కరుణాకర్ కి చెందిన ఏనుగు రథాన్ని  గండ్ర సత్యనారాయణ రావు పూజలు నిర్వహించి, టెంకాయ కొట్టి రథాన్ని కోటంచ వరకు ప్రారంభించారు.

జోగయ్యపల్లి గ్రామానికి చెందిన విజయ్ ఆధ్వర్యంలో స్వామి వారి పల్లకి జోగయ్య పల్లి నుండి కోటంచకు బయలుదేరగా, మార్గ మధ్యలో గండ్ర సత్యనారాయణ రావు కొద్దిసేపు పల్లకి మోసి, స్వామి వారి సేవలో పాల్గొన్నారు. కోటంచ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన  ఆలయ పూజారులు వారికి శాలువా కప్పి ఘన సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో  కాంగ్రెస్ నాయకులు ములుకనూరి భిక్షపతి, టైగర్ రాజయ్య, విజయ్ లతో పాటు  పలువురు నాయకులు ఉన్నారు.