మహాదేవపూర్ లో మొక్కలు నాటే కార్యక్రమం

మహాదేవపూర్ లో మొక్కలు నాటే కార్యక్రమం

మహాదేవపూర్, ముద్ర: తెలంగాణ ప్రభుత్వం కోటి మొక్కలు నాటే కార్యక్రమం నేడు చేపట్టాలని ఇచ్చిన ఆదేశాలలో భాగంగా ఎంపీడీవో రవీంద్రనాథ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇట్టి కోటి మొక్కలు నాటే కార్యక్రమంలో మహదేవపుర్ మండల పరిషత్ అధ్యక్షులు శ్రీమతి రాణిబాయి రామారావు, ఎంపీడీవో రవీంద్రనాథ్,  ఎంపీఓ ప్రసాద్, ఉపాధి హామీ ఎపిఓ రమేష్,  వివిధ గ్రామపంచాయతీలలో పర్యటిస్తూ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. మహాదేవపూర్ లో రైతు కేంద్రం  శ్రీపతి బాపు, ఎంపీపీ రాణిబాయి మొక్కలు నాటారు. ముందుగా విద్యార్థులతో అధికారులు కలిసి ర్యాలీ నిర్వహించి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. మండలంలోని 18 గ్రామపంచాయతీలో 16550 మొక్కలు నాటడం జరిగిందని ఎంపీడీవో  ఒక ప్రకటనలో ఎంపీడీవో రవీంద్రనాథ్, మండల పంచాయతీ అధికారి ప్రసాద్, ఏపీఓ రమేష్, టెక్నికల్ అసిస్టెంట్ కిరణ్, శ్రీకాంత్, మధుకర్, శైలజ, పంచాయతీ కార్యదర్శులు సమ్మయ్య , సతీష్ వివిధ గ్రామ పంచాయతీల సర్పంచులు, ఉపాధి హామీ కూలీలు, ప్రజా ప్రతినిధులు ఉత్సాహంగా మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు.