11న టియుడబ్ల్యూజే(ఐజేయు) జిల్లా ద్వితీయ మహాసభ

11న టియుడబ్ల్యూజే(ఐజేయు) జిల్లా ద్వితీయ మహాసభ

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి:తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (ఐజేయు) జయశంకర్ భూపాలపల్లి జిల్లా ద్వితీయ మహాసభ ఈ నెల 11న జిల్లా కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయం ముందు గల సింగరేణి కాంట్రాక్ట్ అసోసియేషన్ బిల్డింగ్  హాల్ లో నిర్వహించడం జరుగుతుందని ఆ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సామంతుల శ్యామ్, క్యాతం సతీష్ లు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి రెడ్డి తో పాటు,టియుడబ్ల్యుజే(ఐజేయు) రాష్ట్ర అధ్యక్షుడు నంగునూరి శేఖర్,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరహత్ అలీ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు దొంతు రమేష్, రాష్ట్ర కార్యదర్శి గాడిపెల్లి మధు, జాతీయ కౌన్సిల్ మెంబర్ దాసరి కృష్ణారెడ్డి, తెలంగాణ రాష్ట్ర చిన్న పత్రికల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్ బాబు, జాతీయ కౌన్సిల్ మెంబర్, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ కోశాధికారి అడ్డగొడ రాజేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గడ్డం రాజు రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వల్లాల వెంకటరమణ, గుంటి విద్యాసాగర్,తదితరులు హాజరు కానున్నందున జిల్లాలోని జర్నలిస్టు మిత్రులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.