రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

మహాదేవపూర్, ముద్ర: మహాదేవపూర్ గ్రామానికి చెందిన చికెన్ సెంటర్ యజమాని సాబీర్ హుస్సేన్ (45) అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణించారు. తన సొంత కారులో కాటారం వెళుతుండగా నస్తురుపల్లి స్టేజి సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో ఈ కారు ప్రమాదానికి గురైంది. సాబీర్ హుస్సేన్ అక్కడికక్కడే మృతిచెందగా కారులో ఉన్న అని అన్నకు తీవ్ర గాయాలు కాగా వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు కాగా ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి.