10 లక్షల రూపాయలతో రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గండ్ర.

10 లక్షల రూపాయలతో రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గండ్ర.

చిట్యాల ముద్ర:- జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం దూద్ పల్లి, గ్రామం మరియు భూపాలపల్లి మండలం, కొత్త పల్లి ఎస్ ఎమ్ గ్రామాల రైతులు పంట పొలాలకు వెళ్ళడానికి రహదారి నిర్మాణ పనులకు  శంకుస్థాపన చేసిన , భూపాలపల్లి శాసన సభ సభ్యులు గండ్ర వెంకట రమణా రెడ్డి ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ దూత్ పల్లి మరియు కొత్తపల్లి ఎస్ ఎమ్ గ్రామాలు భూపాలపల్లి చిట్యాల మండల కూడలి అయిన ఈ రెండు గ్రామాల రైతులు పంట పొలాలకు వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది అని గ్రామాల సర్పంచ్ మరియు ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు నా దృష్టికి తీసుకురావడం జరిగింది వెంటనే సి డి పి నిధుల నుండి 10 లక్షల రూపాయలతో రెండు గ్రామాల ప్రజలకు, రైతులకు ఉపయోగపడే విధంగా దాదాపు 3 కిలో మీటర్ల రహదారి నిర్మాణం చేపట్టారు.ఈ సందర్భంగా రైతులకు ఎమ్మెల్యే  విజ్ఞప్తి చేస్తూ ఈ వానాకాలం పంటలో 1001 రకం వరి పంట వేయవద్దని,అవి కాకుండా సన్న రకం ధాన్యం పండించాలని రైతులను కోరారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి  గొర్రె సాగర్ ఎంపీపీ దావూ వినోద వీరారెడ్డి సర్పంచ్ పులి వెంకటేష్ గౌడ్ టేకుమట్ల జెడ్పిటిసి పులి తిరపతి రెడ్డి,  అయా మండల,గ్రామాల ప్రజా ప్రతినిదులు, నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.