స్నేహితుని కుటుంబానికి ఆర్థిక అండ

స్నేహితుని కుటుంబానికి ఆర్థిక అండ

ముద్ర న్యూస్ రేగొండ:-వారంతా చిన్ననాటి స్నేహితులు.. కలిసిమెలిసి ఆటలాడుకుంటూ చదువుకున్నారు. పెరిగి పెద్దయి ఎవరికి వారు జీవితాలలో స్ధిరపడ్డారు. ఇంతలో తమతో చదివిన చిన్ననాటి మిత్రుడు అనారోగ్యంతో అకాల మృతి చెందాడన్న విషయం తెలిసి చలించిపోయారు. ఎలాగైనా స్నేహితుని కుటుంబానికి అండగా నిలవాలని సంకల్పించుకుని బృందంగా ఏర్పడి చేయి చేయి కలిపి చేతనైనంత సాయాన్ని చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు తల కొంత నగదును సేకరించిన మొత్తాన్ని మిత్రుడి భార్యకు అందజేశారు. వివరాల్లోకి వెళ్తే... రేగొండ మండలంలోని భీమ్ నగర్ తండాకు చెందిన భానోతు యాకుబ్ గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. మృతుడు.యాకుబ్  తోటి మిత్రులతో కలిసి 1999లో పదో తరగతి, చదువుకున్నాడు. ఈ బ్యాచ్‌కు చెందిన బాల్యమిత్రులంతా కలిసి మృతుని ఆర్థిక పరిస్థితి తెలుసుకున్నారు. ఆ కుటుంబానికి సాయం చేయాలనే సంకల్పంతో రూ.13.500 వేలును సేకరించారు. ఆ నగదును ఆదివారం  స్నేహితుని భార్య, కుటుంబ సభ్యులకు అందజేశారు. ఇందులో బాల్య మిత్రుల బృందం సభ్యులు అనుషమల్లిక్,హైమావతి, సుమత,మాధవి,కలిసి గ్రామానికి వెళ్లి ఆ మొత్తాన్ని అందజేశారు. మానవతా దృక్పథంతో మిత్రునికి అండగా నిలిచి సాయాన్ని అందజేసిన స్నేహితులను గ్రామస్థులు, అతని కుటుంబ సభ్యులు అభినందించారు.