వరంగల్ లో చోరీ

వరంగల్ లో చోరీ

ముద్ర ప్రతినిధి, వరంగల్: వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ మండలం బొల్లికుంట గ్రామంలో చోరీ జరిగింది. గౌలికార్ గోపి అనే వ్యక్తి ఇంట్లో చొరబడిన దొంగలు 50 తులాల బంగారం, 2 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. శుక్రవారం సాయంత్రం ఇంటికి తాళం వేసి యాదగిరిగుట్ట కు వెళ్ళగా చోరీ జరిగిన విషయాన్ని స్ధానికులు చెప్పడంతో ఇంటికి వచ్చిన బాధితులు పోలిసులకు ఫిర్యాదు  చేసారు. ఈ మేరకు పోలీసులు విచారణ చేస్తున్నారు