హన్మకొండ లో రోడ్డు ప్రమాదం..  యువకుడు మృతి ఇద్దరికి గాయాలు

హన్మకొండ లో రోడ్డు ప్రమాదం..  యువకుడు మృతి ఇద్దరికి గాయాలు

ముద్ర ప్రతినిధి, వరంగల్: హన్మకొండ లో తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. నిట్ కళాశాల వద్ద బైక్ లారీని వెనుక వైపు నుంచి ఢీ కొంది. ఈ ప్రమాదం లో కాజీపేట బాపూజీ నగర్ కు చెందిన భరద్వాజ్ హాస్పిటల్ కు తరలిస్తుండగా మృతి చెందాడు. లోకేష్, అర్జున్ గాయపడగా పోలీసులు వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. బైక్‌ను అతివేగంగా, నిర్లక్ష్యంగా నడుపుతూ ఓవర్‌టేక్ చేస్తున్నప్పుడు లారీని ఢీకొట్టినట్లు ప్రత్యక్ష సాక్షి తెలిపినట్టు పోలీసులు వెల్లడించారు