అరుణాచలానికి ప్రత్యేక బస్సులు .. వరంగల్ 1 డిఎం

అరుణాచలానికి ప్రత్యేక బస్సులు .. వరంగల్ 1 డిఎం

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: తమిళనాడులోని అరుణాచలం ప్రత్యేక బస్సు నడపనున్నట్లు వరంగల్ 1 డిపో మేనేజర్ పి. శ్రీనివాసరావు తెలిపారు. గురువారం ఆయన స్థానిక బస్ స్టేషన్ లో మాట్లాడుతూ తమిళనాడులోని అరుణాచలంలో జూలై 3న గిరి ప్రదర్శన చేయాలనుకునే భక్తులకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును హన్మకొండ నుంచి నడుపుతున్నట్టు తెలిపారు. జూలై 1 వ తేదీ రాత్రి 10 గంటలకు హన్మకొండ నుంచి బయలుదేరి 2వ తేదీ రాత్రి 10 గంటలకు అరుణాచలం చేరుతుందన్నారు. అక్కడ గిరి ప్రదక్షణ  తర్వాత జూలై 3  సాయంత్రం 3 గంటలకు వెల్లూరులోని గోల్డెన్ టెంపుల్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి సన్నిధికి తీసుకువెళ్తుంది. అమ్మవారి దర్శనం తర్వాత హనుమకొండకు జూలై 4 మధ్యాహ్నం 1 గంటలకు చేరుకుంటుంది. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాల కోసం 9959226047, 7382852558 పై సెల్ నెంబర్లను సంప్రదించాలన్నారు.