సాయిచంద్ మరణం తీరని లోటు

సాయిచంద్ మరణం తీరని లోటు
  • అటువంటి మనిషి మరొకరు దొరకరు
  • బీఆర్ఎస్ పార్టీ తొగుట మండల అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి

ముద్ర ప్రతినిధి :సిద్దిపేట:- తెలంగాణ కళామతల్లి ముద్దుబిడ్డ,గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయి చందు అకాల మరణం చాలా బాధాకరమని సిద్దిపేట జిల్లా తొగుట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని గుర్రంగూడ లో సాయి చందు పార్థీవ దేహాన్ని దర్శించి నివాళి అర్పించారు.గొప్ప గొప్ప వ్యక్తులు కొన్ని ఏళ్లలోనే ప్రజలతో ఆత్మీయ అనుబంధం ఏర్పాటు చేసుకొని ఆకస్మికంగా మృతి చెందడం బాధాకరమన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో,నేడు తెలంగాణ అభివృద్ధి లోఅంతరంగం నుండి సాయిచందు మాట్లాడినట్లు,పాట పాడినట్లు,భవిష్యత్ లో ఎవరూ పాడ లేరు పాడ బోరు మాట్లాడలేరని ఆయన పేర్కొన్నారు.తెలంగాణ చరిత్ర లో సాయిచందు పేరు శాశ్వతంగా నిలిచిపోతుందన్నారు. సాయిచందు మరణం బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటన్నారు.