ఛత్తీస్ గఢ్ లో రోడ్డు ప్రమాదం... 8 మంది దుర్మరణం

ఛత్తీస్ గఢ్ లో రోడ్డు ప్రమాదం... 8 మంది దుర్మరణం

Road Accident: ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా, మరో 23 మందికి పైగా గాయపడ్డారు. బెమెతర జిల్లాలోని కతియా గ్రామంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై ఆగివున్న ఒక కారును, వేగంగా వచ్చిన ఒక ట్రక్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. ప్రమాద సంఘటన స్థలంలోనే ఎనిమిది మంది మృతి చెందినట్టుగా అధికారులు పేర్కొన్నారు. మృతి చెందిన వారిని భూరి నిషాద్ (50), నీర సాహు (55), గీతా సాహు (60), అగ్నియ సాహు (60), ఖుబ్బూ సాహు (39), మధు సాహు (5), రికేష్ నిషాద్ (6), ట్వింకిల్ నిషాద్ (6) గా గుర్తించినట్టు అధికారులు తెలిపారు. ఈ వాహనంలో దాదాపు 40 నుంచి 50 మంది ప్రయాణిస్తున్నట్టు తెలుస్తోంది. వీరంతా తిరయ్య గ్రామంలో ఒక కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా, కతియా గ్రామం వద్ద ప్రమాదం జరిగింది. మృతులను పత్ర గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన నలుగురు వ్యక్తుల పరిస్థితి విషమంగా ఉండడంతో రాయపూర్ లోని ఎయిమ్స్ కు పంపించినట్టు బెమెతెర కలెక్టర్ రణ్ వీర్ శర్మ తెలిపారు. బీజేపీ ఎంపీ దేపేష్ సాహు ఆస్పత్రిని సందర్శించి క్షతగాత్రులను పరామర్శించారు.