డివైడర్ ఢీకొని యువకుడి మృతి

డివైడర్ ఢీకొని యువకుడి మృతి

ముద్ర, మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం.. చిట్యాలలోని నవాబుపేట గ్రామాల మధ్యన ఉన్న బ్రిడ్జి డివైడర్ ను బైక్ తో ఢీకొని యువకుడు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం చిట్యాల మండలంలోని నవాబుపేట గ్రామానికి చెందిన మిర్యాల రాకేష్ 18 అనే యువకుడు, మరో యువకునితో కలిసి బైక్ పై మొగుళ్ళపల్లి నుండి నవాబుపేట వైపు వెళుతుండగా..రెండు గ్రామాల మధ్యలో ఉన్న బ్రిడ్జిపై బైక్ అదుపుతప్పి డివైడర్ ను ఢీకొనడంతో మిర్యాల రాకేష్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరొక యువకుడు గాయాల పాలు కాగా అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు.