వృద్ధ దంపతులపై దాడి

వృద్ధ దంపతులపై దాడి

భర్త మృతి భార్యకు తీవ్ర గాయాలు

ముద్ర ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: వ్యక్తిగత కారణాలతో వివక్షత కోల్పోయి వృద్ధ దంపతులపై ఓ యువకుడు దాడి చేసిన సంఘటన మున్సిపల్ పరిధిలోని కూలీలైన్ లో ఆదివారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం కూలీలైన్ కు చెందిన దొడ్డి పోశయ్య (75) లక్ష్మమ్మ అనే వృద్ధ  దంపతులపై  అదే ఏరియాకు చెందిన హరి ప్రసాద్ అనే వ్యక్తి దాడి చేశాడు ఈ ఘటనలో పోశయ్య అక్కడికక్కడే మృతిచెందగా లక్ష్మమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గాయాలపాలైన వృద్ధురాలని చికిత్స నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోశయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.