రెసిడెన్సీయల్ పాఠశాల విద్యార్థిని మృతి

రెసిడెన్సీయల్ పాఠశాల విద్యార్థిని మృతి

తూప్రాన్, ముద్ర:తూప్రాన్ లో గల మహాత్మా జ్యోతి బా పూలె బాలికల రెసిడెన్సీయల్ పాఠశాల విద్యార్థి అస్వస్థత గురై ఆస్పత్రిలో చేరి మృతి చెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. పెద్ద శంకరం పేట మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన సౌజన్య (13) 8వ తరగతి చదువుతుంది. ఈ నెల 22న జ్వరం రాగా హస్టల్ వార్డెన్ టాబ్లెట్ ఇచ్చారు. ఇయినా జ్వరం తగ్గకపోవడంతో విద్యార్థిని తల్లిదండ్రులకు సమాచారం అందచేశారు.

కుటుంబ సభ్యులు హైదరాబాద్ అస్పత్రికి తరలించారు. మరింత తీవ్ర అస్వస్థతకు గురైన విద్యార్థి అస్పత్రిలో చికిత్స పొందు తూ ఆదివారం మృతి చెందింది. ఈ విషయంపై విద్యార్ధిని బంధువులు పాఠశాల ప్రిన్సిపాల్ అర్షియా తరణ్మన్, వార్డెన్ నిర్లక్ష్యం వల్లే తమ అమ్మాయి మృతి చెందిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం పాఠశాల పిన్సిపల్ అర్షియాను వివరణ అడగగా విద్యార్థిని జ్వరం విషయంలో  తమ నిర్లక్ష్యం ఏమి లేదని సమయానికి స్పందించి మందులు అందించామని,  అనంతరం తల్లిదండ్రులకు సమాచారం అందించినట్లు ఆమె తెలిపారు.  విద్యార్థిని మృతి చెందడం బాధాకరం అని ఆమె తెలిపారు.