అడవి జంతువుల కోసం ఆ మార్చిన కరెంటు తీగ కు యువకుడు బలి

అడవి జంతువుల కోసం ఆ మార్చిన కరెంటు తీగ కు యువకుడు బలి

ముద్ర కోనరావుపేట :అడవి జంతువుల వేట కోసంఅమర్చిన కరెంట్ తీగ,యువకుడి ప్రాణం తీసిన సంఘటన,రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట  మండలంలోని మరిమడ్ల గ్రామంలో  చోటుచేసుకుంది. వివరాల ప్రకారం జై సేవాలాల్ భూక్యారెడ్డి తండాకు చెందినటువంటి భూక్యా కిషోర్,(25) మరిమడ్ల అటవీ ప్రాంతంలో భూమిని దున్నుటకు, గురువారం తెల్లవారు జామున ఒంటిగంట ప్రాంతంలో  మోటార్ సైకిల్ పై ముందు వెళ్తు, వెనుక ట్రాక్టర్లకు దారి చూపిస్తున్న క్రమంలో, మరిమడ్ల అటవీ ప్రాంతంలోని ఎలుక చెట్ల సమీపంలో,ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు వన్యప్రాణుల వేట గురించి ఇనుప వైర్ అమర్చి కరెంట్ షాక్ పెట్టగా,కిషోర్ అట్టి వైర్లకు తగిలి షాక్ కొట్టి చనిపోయినాడు అని కిషోర్ భార్య విజయ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు కోనరావుపేట ఎస్ ఐ రమాకాంత్ తెలిపారు.