అడవి శ్రీరాంపూర్ లో పురుగుల మందు తాగి వ్యవసాయ కూలీ మృతి

అడవి శ్రీరాంపూర్ లో పురుగుల మందు తాగి వ్యవసాయ కూలీ మృతి

 ముద్ర, ముత్తారం: మండలంలోని అడవి శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన బోమెల్ల రాజమల్లు (55) పురుగుల మందు సేవించి శుక్రవారం, మృతి చెందారు. ఎస్సై మధుసూదన్ రావు తెలిపిన వివరాల ప్రకారం వ్యవసాయ కూలి పని చేసుకుంటూ జీవనం గడుపుతున్న రాజమల్లు భార్య గత కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో చనిపోగా మద్యానికి బానిస అయిన రాజమల్లు మందు తాగిన మైకంలో ఏదో పురుగుల మందు తాగి కిందపడి ఉండగా గమనించిన తోటి కుటుంబ సభ్యులు ముత్తారంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకు తీసుకుపోయి ప్రథమ చికిత్స అనంతరం పెద్దపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. అతని మరణం పై ఎవరిపై ఎలాంటి అనుమానం లేదని సోదరుడు ప్రభాకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.