లారీ ఢీకొని మహిళ మృతి

లారీ ఢీకొని మహిళ మృతి

కోదాడ, ముద్ర:లారీ ఢీకొని మహిళ మృతి చెందిన సంఘటన ఆదివారం కోదాడ పట్టణంలోని  కోదాడ -మేళ్లచెరువురహదారిపై ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని గోపిరెడ్డి నగర్ కు చెందిన అంబటి ఉమ(37) గోపిరెడ్డి నగర్ నుండి మేళ్లచెరువు రహదారి రోడ్డు దాటుతున్న క్రమంలో ఖమ్మం ఎక్స్ రోడ్ నుండి మేళ్లచెరువు వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టడంతో కాళ్లు నుజ్జు  కావడం తో ప్రథమ చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మేరుగైన చికిత్స నిమిత్తం ఖమ్మం తరలిస్తున్న క్రమంలో మార్గంమధ్యలో మృతి చెందింది. ఈ ప్రమాదంపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.