రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు... 

రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు... 

వెల్గటూర్, ముద్ర : జగిత్యాల జిల్లా, వెల్గటూర్ మండలంలోని కప్పారావుపేట గ్రామ శివారులో ఆటో, ద్విచక్ర వాహనం ఢీకొని మండలంలోని ముత్తునూరు గ్రామానికి  చెందిన సంఘ శ్రీనివాస్ తో పాటుగా, ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి వెల్గటూర్ మండలంలోని రాంనూర్ గ్రామం నుంచి ఆటో వెల్గటూర్ వైపు వస్తుంది.

అదే సమయం లో ముత్తునూర్ గ్రామానికి చెందిన సంఘ శ్రీనివాస్ ద్విచక్ర వాహనం పై కప్పారావుపేట నుంచి ముత్తునూరు వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో రెండు వాహనాలు మండలంలోని కప్పారావుపేట గ్రామ శివారులో ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీనితో ద్విచక్ర వాహనం కింద పడిపోగా సంఘ శ్రీనివాస్ తలకు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఆటోలో ప్రయాణిస్తున్న ఓ మహిళతోపాటు యువకుడికి కూడ గాయలయ్యాయి. కాగా అక్కడి స్థానికులు వారిని చికిత్సకోసం అంబులెన్స్ లో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.