నీటి సమస్యను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి.

నీటి సమస్యను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి.
  • నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు                   
  • ఎమ్మెల్యే  రాజేష్ రెడ్డి 

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి గారు ఆదేశించారు నియోజకవర్గం లోని తాడూర్ మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండలు బాగా ఉన్న సందర్భంగా గ్రామాలలో ప్రజలకు నీటి సమస్య తలెత్తకుండా గ్రామస్థాయి అధికారులతో మండల స్థాయి అధికారులు సమీక్షలు నిర్వహించివెంటనే చర్యలు తీసుకోవాలని నీటి సమస్యపై తనకు ఫిర్యాదులు అందుకే సహించేది లేదని హెచ్చరించారు. అవసరమైన గ్రామాలలో బోర్లు వేయడం మరియు ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేయాలనిసూచించారు ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.