ప్రజల చూపు బిఆర్ఎస్ వైపే

ప్రజల చూపు బిఆర్ఎస్ వైపే

వారం రోజుల క్రితం మండల పరిధిలోని కల్వరాల గ్రామానికి చెందిన బాబు,రాముడు,సుధాకర్,కృష్ణయ్య లు కాంగ్రెస్ పార్టీలో చేరగా మళ్లీ సోమవారం తిరిగి బరాస పార్టీ అభ్యర్థి కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి సమక్షంలో సొంతగూటి కి బిఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీరం మాట్లాడుతూ19 ఏండ్ల పాలనలో దోచుకుని దాచుకున్న డబ్బులతో ఓటర్లను కొనాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకుల కుట్రలు నియోజకవర్గ ప్రజలందరికీ ఎప్పుడో అర్థమయ్యాయని, ఈ ఎన్నికల్లో కొల్లాపూర్ ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని అన్నారు.19 ఏళ్లు పాలించి సొంత అభివృద్ధి తప్ప కొల్లాపూర్ అభివృద్ధిని గాలికి వదిలేసారని,బ్యాంకులను ముంచి..చివరకు దేవుడి భూములకు కూడా ఎసురు పెట్టారని అలాంటి నాయకులు మనకు అవసరమా అని అన్నారు.ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత చేసిన అభివృద్ధి కళ్ల ముందే ఉందని,,అభివృద్ధికి పట్టం కట్టాలని ,మరొక్కసారి ఆశీర్వదించాలని ప్రజలను కోరారు.కార్యక్రమంలో ఎంపీపీ కమలేశ్వరరావు, తూముకుంట సింగిల్ విండో మాజీ ఉపాధ్యక్షులు రవీందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.