నాగర్ కర్నూల్ కాంగ్రెస్ పార్టీ యువనేత అనుచరుడి వీరంగం..
- కాలనీలో శబ్ధం చేస్తుండని మతిస్థిమితం లేని వ్యక్తిపై రోకలిబండతో దాడి..
- కొడుకుని కొట్టడం చూసి అడ్డుపడిన తల్లి..
- తల్లి, కొడుకును కాలు చేతులు కట్టేసి చితక బాదిన వైనం..
- జిల్లా కేంద్రంలోని రామాలయం వీధిలో అర్ధరాత్రి సంఘటన..
నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ కాంగ్రెస్ పార్టీలో ఇటీవల చేరిన ఓ యువ నేత అనుచరుడు కర్షకత్వం ప్రదర్శించాడు. మతిస్థిమితం లేని ఓ యువకుడి పై కాలు చేతులు విద్యుత్ పోల్ కి కట్టేసి మరి రోకలిబండతో చితకబాదాడు. ఈ సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని రామాలయం వీధిలో బుచ్చమ్మ అనే మహిళ నివసిస్తుంది. ఆమె కుమారుడు కిషోర్ ఉన్నత చదువులు చదివి, అనారోగ్య కారణాల వల్ల మతిస్థిమితం కోల్పోయాడు. ఇంట్లోనే ఉంటూ పట్టణంలో తిరుగుతూ ఉండేవాడు. ఆదివారం అర్ధరాత్రి అదే కాలనికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువనేత అనుచరుడు ఆయన బంధువుల ఇంట్లో ఉన్నాడు. కాలనీలో కిషోర్ శబ్దం చేస్తున్నడని ఇంట్లో నుంచి బయటకు వచ్చి అతనిపై దాడి చేశాడు. దెబ్బలు తాళలేక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయినా కనుకరించని కాంగ్రెస్ పార్టీ యువనేత అనుచరుడు అతని వెంబడించి పట్టుకొని ఆటోలో మళ్ళీ అదే కాలనిలోకి తీసుకొచ్చి రోకలిబండతో చితకబాదాడు. అంతటితో ఆగకుండా అతని కాళ్లను కట్టేసాడు. ఇంట్లో ఉన్న కిషోర్ తల్లి బుచ్చమ్మ తన కొడుకు పై దాడిన్ని తెలుసుకొని తన కుమారుడిని కొట్టకూడదు అని అడ్డురావడంతో బుచ్చమ్మని కూడా కాళ్లు చేతులు కట్టేసి రోకలిబండతో చితక బాదాడు. ఈ సంఘటనను అక్కడే ఉన్న కాలనీవాసులు మొబైల్ లో చిత్రీకరించి సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. అనంతరం స్థానికులు వొచ్చి భుచమ్మ, కిషోర్ నీ ఆసుపత్రికి తరలించారు.