నీళ్లు,నిధులు,నియామకాల నినాదంతో వచ్చిన తెలంగాణ ఎవడి పాలయింది

నీళ్లు,నిధులు,నియామకాల నినాదంతో వచ్చిన తెలంగాణ ఎవడి పాలయింది

ముద్ర. కొల్లాపూర్: నీళ్లు, నిధులు,నియామకాల నినాదంతో వచ్చిన తెలంగాణ ఎవడి పాలయిందని కొల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు తనయుడు జూపల్లి అరుణ్ ప్రశ్నించారు.పాన్ గల్ మండల కేంద్రంలో మరియు మల్లయిపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో బళ్లారి ఎమ్మెల్యే భారత్ కుమార్ రెడ్డి, కొల్లాపూర్  యువ నాయకుడు జూపల్లి అరుణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్బంగా ముఖ్య అతిధిగా విచ్చేసిన బళ్లారి ఎమ్మెల్యే భారత్ రెడ్డి మాట్లాడుతూ  జూపల్లి  మంత్రిగా ఉన్నప్పుడు కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజల పై ఏనాడు కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడలేదు అని,అందరు శాంతంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలని అనుకున్నాడు కానీ, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ప్రశ్నించే వారిపై అక్రమ కేస్ లు పెట్టించి,కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడని, భూ అక్రమాలకు పాల్పడుతున్నాడని, ఎమ్మెల్యే అవినీతి పాలనపై విమర్శలు గుప్పించారు.జూపల్లి అరుణ్  మాట్లాడుతూ నీళ్లు,నిధులు,నియామకాల నినాదంతో వచ్చిన తెలంగాణ ఎవడి పాలయిందాని, తెలంగాణ ఇచ్చిన సోనియామ్మ ఋణం తీర్చుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

 కార్యక్రమంలో పాన్ గల్ మండల ప్రస్తుత,మాజీ ప్రజాప్రతినిధులు మరియు మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.