ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించాలి: కలెక్టర్ పి ఉదయ్ కుమార్

ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించాలి: కలెక్టర్ పి ఉదయ్ కుమార్

నాగర్ కర్నూల్ జిల్లా ముద్ర ప్రతినిధి: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని జిల్లా  కలెక్టర్‌ పి.ఉదయ్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వివిధ శాఖల సమస్యల పరిష్కారం పై వచ్చిన 30 ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ స్వీకరించారు.

వచ్చిన ఫిర్యాదును వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు చొరవ చూపాలన్నారు. ప్రజావాణిలో డిఆర్డిఏ పిడి నర్సింగరావు, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి భూపాల్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.