సమస్యలు పరిష్కరించి నివేదికలు అందజేయాలి జిల్లా కలెక్టర్ అనుదీప్

సమస్యలు పరిష్కరించి నివేదికలు అందజేయాలి జిల్లా కలెక్టర్ అనుదీప్

ముద్ర ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ప్రజావాణిలో వచ్చిన సమస్యలను పరిష్కరించి బుధవారం లోపు నివేదికలను అందజేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణిలో జిల్లా నుండి వచ్చిన ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన ప్రతి సమస్య పరిష్కారానికి త్వరితగతిన చర్యలు చేపట్టాలన్నారు.

ప్రజా ప్రతినిధులు సిఫార్సు చేసిన 65 లేఖలు పెండింగ్లో ఉన్నాయని అధికారులు వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. సుజాతనగర్, చుంచుపల్లి, అన్నపురెడ్డిపల్లి, బూర్గంపాడు, పాల్వంచ మండలాలు చెందిన ప్రజలు గ్రీవెన్స్ లో వినతి పత్రాలను అందజేశారు. ప్రజావాణి కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.