ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి

ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: ప్రజావాణి లో వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులు తక్షణమే పరిష్కరించాలని జిల్లా శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులకు పంపి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. వచ్చిన ఫిర్యాదులను ఆన్లైన్లో నమోదు చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో  డిఆర్డిఓ సాయన్న, ఏవో రవీందర్, ఎన్నికల పర్యవేక్షకుడు సాయి భుజంగరావు, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.  కాగా ప్రజావాణి లో మొత్తం58 ఫిర్యాదు వచ్చాయి.