అన్నల కోసం తమ్ముళ్ల ప్రచారం !

అన్నల కోసం తమ్ముళ్ల ప్రచారం !
  • బాన్సువాడలో శంభురెడ్డి                           
  • కామారెడ్డిలో కొండల్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: ఎన్నికల్లో పోటీ చేస్తున్న తమ అన్నల కోసం తమ్ముళ్లు జోరుగా ప్రచారం చేస్తున్నారు.   బాన్సువాడలో బిఆరెస్ తరపున పోటీ చేస్తున్న అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గెలుపు కోసం ఆయన తమ్ముడు పోచారం శంభురెడ్డి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.  గత వారం రోజులుగా బాన్సువాడ పట్టణంలోని మదీన్ కాలనీ, టీచర్స్ కాలనీ, ఎన్జీవో కాలనీ, చైతన్య కాలనీ తదితర ప్రాంతాల్లో గడపగడపకు వెళ్లి ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో సంక్షేమ పాలన టిఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని,  బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి పోచారంను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.   గతంలో కొనసాగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి కుటుంబానికి అందాలన్నా- బి ఆర్ ఎస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన అనేక సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేరవేయాలన్న, ప్రతి ఒక్క కుటుంబానికి పెద్దన్నగా మారిన పోచారం  గెలుపునకు ప్రతి ఒక్కరు కృషి చేయవలసిందిగా,30వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రతి గడపకు వెళ్లి అభ్యర్థించారు.          

కామారెడ్డి లో రేవంత్ రెడ్డి తరపున కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరపున పోటి చేస్తున్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తరపున ఆయన తమ్ముడు కొండల్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. గత వారం రోజులుగా ఇక్కడే మకాం వేసిన ఆయన ఎన్నికల ప్రచార బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. మంగళవారం నాడు కామారెడ్డి టౌన్ రాశివనంలో   మార్నింగ్ వాక్ లో టీపిసిసి అధ్యక్షుడు ఏనుముల రేవంత్ రెడ్డి  సోదరుడు ఏనుముల కొండల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలియజేసి భారి మేజర్టితో రేవంత్ రెడ్డిని గేలిపించాలాని కోరారు.