కళ్లకి గంతలు కట్టుకొని బైక్ పై అయ్యోద్యకి బయల్దేరిన మెజిషియన్లు
ముద్ర ప్రతినిధి, కామారెడ్డి:హైదరాబాద్ నుండి అయోధ్య వరకు దాదాపు 1600 km కళ్ళకు గంతలు కట్టుకుని మోటార్ సైకిల్ పైన యాత్ర చేస్తున్న మేజిషియన్ లు మారుతి జోషి, రామకృష్ణ లు లు నిన్న రాత్రి కామారెడ్డి కి చేరుకున్నారు.శనివారం ఉదయం శ్రీ సరస్వతి శిశు మందిర్ స్కూల్ నుండి అయోధ్యకి బయలుదేరారు. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దల్, బీజేపీ నాయకులు వారి కళ్లకి గంతలు కట్టి వారికి వీడుకోలు పలికారు.
ఈ సందర్భంగా మారుతి జోషి, రామకృష్ణ లు మాట్లాడుతూ దశాబ్దాల కళ నెరవేరి అయ్యోద్య లో బల రాముని విగ్రహ ప్రతిష్టాపన చేసిన సందర్భంగా మేము సైతం రాముని సేవలో జీవితం పరితాప్తం చేయాలని ఉద్దేశంతో కళ్లకి గంతలు కట్టుకొని నిన్న హైదరాబాద్ నుండి బయల్దేరాము అని కామారెడ్డి లో నిన్న ఘన స్వాగతం పలికిన తరువాత ఈ రోజు యాత్ర ప్రారంభం చేశామని నేడు అదిలాబాద్ వరకు యాత్ర కొనసాగుతుందని అన్నారు. కళ్లకి దూది పెట్టుకొని వాటిపై గంతలు కట్టిన తరువాత మొఖం మిధ నుండి ముసుగు వేసుకొని బైక్ పై యాత్ర చేస్తున్నట్టు తెలిపారు.