కామారెడ్డి అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన రేవంత్ రెడ్డి

కామారెడ్డి అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన రేవంత్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి:కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పిసిసి అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డి నామినేషన్ పత్రాలను ఆర్డిఓకు అందజేశారు. కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి  పోటీ చేస్తున్న పిసిసి అధ్యక్షుడు తన నామినేషన్ పత్రాలను ఆర్వో కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. రేవంత్ రెడ్డి వెంట కర్నాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్య, టీజేఏస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, మాజీమంత్రి షబ్బీర్ అలీ ఉన్నారు.  హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో కామారెడ్డికి వచ్చారు.   అనంతరం ఇక్కడ నిర్వహించే భారీ బహిరంగ సభ, బిసి డిక్లరేషన్ సభను కర్ణాటక సీఎం తో కలిసి పాల్గొనున్నారు.   కాగా సీపీఐ సీనియర్ నాయకులు నారాయణ, చాడా వెంకట్రెడ్డిలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికారు.